ఈసీకి కాంగ్రెస్ నేత పొంగులేటి ఫిర్యాదు

ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆయన లేఖ రాశారు.

తాను నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నారు.ఐటీ దాడులు జరుగుతాయని ముందే తెలుసన్న పొంగులేటి తన మీద కుట్రపూరితంగా వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

బీజేపీతో సీఎం కేసీఆర్ కుమ్మక్కై ఐటీతో తనిఖీలు చేయిస్తున్నారని విమర్శించారు.ఈ క్రమంలోనే తాను నామినేషన్ వేసేందుకు సిద్ధమైన సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

కాగా పొంగులేటి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న రామ్ చరణ్.. క్లీంకార పుట్టాక అంతా శుభమే!

తాజా వార్తలు