గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మాయమాటలు చెప్పింది..: ఎమ్మెల్యే కడియం

తెలంగాణలోని కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కడయం శ్రీహరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మాయమాటలు చెప్పిందని ఆరోపించారు.

ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారని కడియం శ్రీహరి విమర్శించారు.ధాన్యం కొనుగోలు వ్యవహారంలోనూ కాంగ్రెస్ మాట తప్పిందని పేర్కొన్నారు.

ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ లో ప్రకటించిన నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్డారు.ఈ క్రమంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ఆ విషయంలో ప్రభాస్, నాని గ్రేట్ అంటున్న అభిమానులు.. అసలేమైందంటే?
Advertisement

తాజా వార్తలు