తెలంగాణ సచివాలయంలో కరోనా కలకలం.. !

తెలంగాణలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తున్న విషయం తెలిసిందే.ఒకవైపు వ్యాక్సిన్ పక్రియ కొనసాగుతుండగా మరోవైపు కరోనా తీవ్రత కూడా పెరుగుతుంది.

 Commotion Of Corona In Telangana Secretariat , Telangana, Secretariat, Corona Co-TeluguStop.com

ఇప్పటికే పలువురు కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే.

ఇకపోతే రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు చివరకు సచివాలయాన్నీ కూడా తాకాయి.

వ్యాక్సిన్ ఉందనే ధైర్యంతో కావచ్చూ లేదా మరేదైన కారణం కావచ్చు కానీ ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి.ఈ క్రమంలోనే ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్‌లో పలువురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం.

కాగా ఈ వార్త సహ ఉద్యోగుల్లో ఆందోళన నింపిందట.ఇదిలా ఉండగా కొద్దిమంది సిబ్బంది కరోనా పాజిటివ్ అని స్పష్టంగా తెలిసినప్పటికీ దాన్ని గోప్యంగా ఉంచిన యధావిధిగా ఆఫీసుకు వచ్చినట్లు మంగళవారం ఉదయం పలువురు ఉద్యోగులకు అనుమానమొచ్చిందట.

అదీగాక వారం రోజుల నుంచి కొద్దిమంది ఉద్యోగులు ఆఫీసుకు రాకుండా వర్క్ ఫ్రం హోమ్ చేస్తుండడంతో ఈ అనుమానం మరింత బలపడగా నిజమా కాదా అని నిర్దారించుకున్నారట.అలా వీరికి నిజం తెలిసి ఇప్పుడు ఆందోళన పడుతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube