మంత్రి ఆర్.కే.రోజాని మర్యాదపూర్వకంగా కలిసిన కామన్వెల్త్ బంగారు పతక విజేత పి.వి.సింధు

హైదరాబాద్: హైదరాబాద్ నోవేటెల్ లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసులు శాఖా మంత్రి ఆర్.కే.

 Common Wealth Gold Medalist Pv Sindhu Met Minister Roja In Novotel Details, Comm-TeluguStop.com

రోజాని మర్యాదపూర్వకంగా కలిసిన కామన్వెల్త్ బంగారు పతక విజేత పి.వి.సింధు. కామన్వెల్త్ క్రీడలు 2022 మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లో విజేతగా నిలిచిన పివి సింధు కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి శ్రీమతి ఆర్.కే రోజానీ హైదరాబాద్ నోవెటేల్ లో కలిశారు.అనంతరం మంత్రి రోజా కుటుంబ సభ్యులు, సింధు కుటుంబ సభ్యులు కలసి లంచ్ లో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నుండి అందించిన సహకారానికి సింధు కృతజ్ఞతలు తెలిపారు.కామన్వెల్త్ గేమ్స్‌ సింగిల్స్ ఈవెంట్‌లో తొలి బంగారు పతకం సాధించిన సింధు విజయానికి యావత్ దేశం గర్విస్తోందనీ మంత్రి రోజా సిందుని కొనియాడారు.

భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube