శ్రీముఖి పై ముద్దుల వర్షం కురిపించిన కమెడియన్స్.. పారిపోయిన శ్రీముఖి?

తెలుగు బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎలా సందడి చేస్తున్నాయో మనందరికీ తెలిసిందే.

అయితే ఎప్పుడు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే కాకుండా ఏదైనా స్పెషల్ ఈవెంట్లు కూడా ప్లాన్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.

ఈ క్రమంలోనే రాఖీ పండుగ సందర్భంగా ఈటీవీ హలో బ్రదర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా నటీనటులందరూ వారి అన్నయ్య తమ్ముళ్లకు రాఖీ కట్టారు.

ఇక ఈ కార్యక్రమానికి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించారు.తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా శ్రీముఖి వేదికపైకి హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ ఆహ్వానించి వారికి ఒక టాస్క్ ఇచ్చింది.

ఇందులో భాగంగా ఒక పాట ప్లే అయితే ఆ పాటకు సంబంధించిన కొన్ని వస్తువులను తెచ్చి తనకి ఇవ్వాలని చెప్పారు.ఇలా చెప్పేసరికి శంకర్ దాదా జిందాబాద్ సినిమాలోని ఆకలిస్తే అన్నం పెడతా వాడే పాట వచ్చింది.

Advertisement

ఈ పాటలో భాగంగా హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ అన్నం కోసం ఆయిల్ కోసం పరుగులు తీస్తుండగా రాంప్రసాద్ మాత్రం యూటర్న్ ఇచ్చి మూడోస్తే ముద్దులు పెడతా అంటూ సాగిపోయే ఈ పాటలో భాగంగా వెళ్లి శ్రీముఖికి ముద్దులు పెట్టారు.

ఇలా హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ ఇద్దరు వెళ్లి శ్రీముఖికి ముద్దులు పెడుతుండగా ఒకసారిగా అక్కడ ఏం జరుగుతుందో అందరూ ఆలోచనలో పడ్డారు.అయితే ఆది ఆటో రాంప్రసాద్ శ్రీముఖి బుగ్గపై కాకుండా ఆమె చేతిలో ముద్దులు పెట్టారు.అనంతరం హైపర్ ఆది మాట్లాడుతూ ఆకలిస్తే అన్నం పెడతా అలిసోస్తే ఆయిల్ పెడతా మూడోస్తే ముద్దులు పెడతా అని ఉండగా తనకు ముద్దులు పెట్టమంటూ వివరించారు.

ఇకపోతే శ్రీముఖి హైపర్ ఆది ఆటో రాంప్రసాద్ కు షాక్ ఇస్తూ ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన నవీన్ చంద్రకు ముద్దు పెడుతుంది.ఇక నవీన్ చంద్ర శ్రీముఖి ఒకవైపు ఉండి ఈ గేమ్ ఆడారు.

అనంతరం మొదటిసారి ముద్దు పెడితే అనే పాట రావడంతో ఈ ముద్దుల గోలేంటి అంటూ శ్రీముఖి వేదికపై నుంచి పారిపోయారు.ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు