కామారెడ్డిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన మాస్టర్ ప్లాన్పై జిల్లా కలెక్టర్ వివరణ ఇచ్చారు.మాస్టర్ ప్లాన్పై అందరి అభ్యంతరాలు తీసుకుంటున్నామని చెప్పారు.
అభ్యంతరాల స్వీకరణకు ఇంకా 60 రోజులు పూర్తి కాలేదని తెలిపారు.ఈ క్రమంలో మాస్టర్ ప్లాన్పై కొందరు అభ్యంతరాలు తెలిపారన్న కలెక్టర్ ఇప్పటివరకు 1026 అభ్యంతరాలు వచ్చాయన్నారు.
ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని స్పష్టం చేశారు.రైతుల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు.
ముసాయిదాలో మార్పులు, చేర్పులు జరుగుతాయన్నారు.జనవరి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు.
భూములు పోతాయని రైతులు ఆందోళన చెందొద్దని వెల్లడించారు.







