వేములవాడ మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాలయాన్నీ ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యాలయం ఆవరణ, తరగతి గదులు, టాయిలెట్స్, కిచెన్, స్టోర్ రూమ్ తదితర గదులు పరిశీలించారు.

అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు పలు అంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడారు వర్షాకాలం నేపథ్యంలో విద్యాలయం ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని విద్యా సంస్థల ఓఎస్డీ సర్వర్ మియాను ఆదేశించారు విద్యార్థులను మ్యాథ్స్ ,సైన్స్ ఇంగ్లీషులో రాణించేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.

మట్టి గణపతి వాడండి

Latest Rajanna Sircilla News