ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తూ, తీరిక సమయం లేకుండా ఎంతో బిజీగా గడిపే జీవితం వారిది.వారికి కళల మీద ఎంతటి నైపుణ్యం ఉన్నా వాటిని పక్కనపెట్టి పరిపాలన విధానాన్ని అనుసరిస్తుంటారు.అయితే తాజాగా ఐఏఎస్ అధికారిని అయిన సీనియర్ సివిల్ సర్వెంట్ రాఖీ గుప్తా ఇటీవల పాడిన ఒక భక్తి గీతం ప్రస్తుతం వైరల్ గా మారింది.
‘మై తోహ్ రతుంగి రాధా నామ్’ అనే భక్తి గీతాన్ని పాడిన రాఖీ గుప్తా ఆ పాటను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడంతో కొన్ని లక్షల మంది చూసి, ఆ పాటకు నెటిజన్లు తిరిగి కామెంట్ చేస్తున్నారు.తను పాడిన ఆ పాట 4:30 నిమిషాల పాటు ఉంది.ఈ అధికారి ని పాడిన పాట కృష్ణుడి పట్ల భక్తిభావం కలిగి ఉంటుందని తెలియజేస్తోంది.
తను ఎంతో ఇష్టంగా పాడిన ఈ భక్తి గీతాన్ని తన తల్లిదండ్రులకు ఇంకా కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నట్లు ఈ కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో గత సంవత్సరం లోనే తీయాలనుకున్నప్పటికీ కొన్ని పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ ప్రస్తుతం ఇప్పుడు తీయాల్సి వచ్చింది.
ఇంతటి మధురమైన పాటను కృష్ణుడు జన్మించిన బృందావనంలోనే చిత్రీకరించడం ఎంతో మంది నెటిజన్లను ఆకర్షించింది.అయితే ఈ పాటకు గౌరవ్ దేవ్, కార్తీక్ దేవ్ సంగీతాన్ని సమకూర్చారు.4:30 నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ అవుతూ,ఎంతో మందిని ఆకర్షించింది.
ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక ద్వారా వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసిన నెటిజన్లు తన అద్భుతమైన స్వరంతో చాలా బాగా పాడారని కామెంట్ చేస్తున్నారు.
ఎంతో భక్తి భావం ఉన్న ఈ పాట ద్వారా మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశారు మేడం అంటూ సదరు నెటిజన్లు కామెంట్ చేయడం విశేషం.అయితే ఇంతటి భక్తి భావం కలిగిన పాటను మీరు కూడా ఒకసారి విని తరించండి.