ఖమ్మం జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్ ప్రగతిభవన్ లో ఖమ్మం జిల్లా నేతలతో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.

ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో జిల్లా నాయకులతో చర్చించనున్నారు కేసీఆర్.అనంతరం బహిరంగ సభ, జన సమీకరణపై పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

కాగా ఈ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.అదేవిధంగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ కూడా ఈ సభకు రానున్నారని సమాచారం.

ఖమ్మంలో సభను విజయవంతం చేసి సత్తా చాటేందుకు బీఆర్ఎస్ సన్నద్ధం అవుతోంది.మరోవైపు ఏపీలోనూ రాజకీయ అడుగులు వేస్తున్న బీఆర్ఎస్ అక్కడ కూడా జనసమీకరణ చేసేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది.

Advertisement
సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని

తాజా వార్తలు