అనంతపురంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం జగన్ తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా నిర్వాసితులనైన వారికి అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.అంతేకాకుండా బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.2000 చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించాలని సీఎం జగన్ సూచించారు.వర్షాలు, వరద తగ్గముఖం పట్టగానే ఆస్తి, పంట నష్టంపై అంచనా వేసి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు