ఏపీ రాజధానిగా విశాఖపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.త్వరలోనే విశాఖ రాజధాని కాబోతుందని వెల్లడించారు.
రాజధాని కాబోతున్న విశాఖకు రావాలని అందరినీ కోరుతున్నట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో కొన్ని నెలల్లో తాను కూడా విశాఖకు షిప్ట్ అవుతున్నట్లు వెల్లడించారు.
ఇకపై అక్కడ నుంచే పరిపాలన వ్యవహారాలు కొనసాగనున్నాయి.ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహాక సదస్సులో పాల్గొన్నారు.
మరోవైపు ఏపీ రాజధానిపై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాజధాని విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.