ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan ) విశాఖలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా ‘విజన్ విశాఖ’ ( Vision Visakha ) సదస్సులో ఆయన పాల్గొననున్నారు.
దాదాపు రెండు వేల మందికిపైగా పారిశ్రామిక వేత్తలతో సీఎం జగన్ భేటీ కానున్నారు.అనంతరం యువతో ఆయన కీలక సమావేశం నిర్వహించనున్నారు.
యువతకు నైపుణ్య శిక్షణ ‘భవిత’ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టనున్నారు.తరువాత విశాఖలో రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు పటిష్ట ఏర్పాట్లను చేశారు.