ఏపీ సీఎం జగన్ మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.ఇందులో భాగంగా రేపు ఆయన హస్తినాకు పయనం కానున్నారని సమాచారం.
పర్యటనలో భాగంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ అవుతారని తెలుస్తోంది.ఈ నెల 17వ తేదీన ప్రధానితో జగన్ సమావేశం అయిన సంగతి తెలిసిందే.
కేవలం రెండు వారాల వ్యవధిలోనే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.