అంబేద్కర్ స్మృతివనం, విగ్రహ నిర్మాణ పనులపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.ఈ మేరకు గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రారంభోత్సవం నాటికి ఒక్క పని కూడా పెండింగ్ లో ఉండకూడదని సీఎం జగన్ తెలిపారు.కన్వెన్షన్ సెంటర్ పనులు కూడా పూర్తి కావాలన్న ఆయన ఈ కన్వెన్షన్ సెంటర్ లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.స్మృతివనం ప్రాంగణం అంతా పచ్చదనం ఉట్టిపడేలా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.