ప్రేమ వ్యవహారంలో చెలరేగిన ఘర్షణలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.జగిత్యాల( Jagityala ) జిల్లా మల్యాల మండలం తక్కలపల్లిలో( Takkalapally ) ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.
ముందుగా మహేశ్ ( Mahesh )అనే యువకుడు యువతి కుటుంబ సభ్యులతో కత్తితో దాడికి పాల్పడ్డాడు.అడ్డుకునే క్రమంలో మహేశ్ పై యువతి బంధువులు బండరాయితో తిరిగి దాడి చేశారు.
దీంతో మహేశ్ అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు.అయితే గత మూడేళ్లుగా యువతిని మహేశ్ వేధిస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కాగా మహేశ్ కత్తితో చేసిన దాడిలో ముగ్గురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.