ఖురాన్‌ను అగౌరవ పరిచారని పాపం క్రైస్తవ జంటను ఏం చేశారో చూడండి!

పాకిస్తాన్‌లోని( Pakistan ) లాహోర్‌ నార్త్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఓ ఘటన ఇపుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది.

దానికి కారణం ముస్లింల మత గ్రంధం అయినటువంటి ఖురాన్.

( Quran ) అవును, ఖురాన్ కాపీని అపవిత్రం చేశారనే ఆరోపణలపై దైవదూషణ కేసు నమోదు కావడంతో ఒక క్రైస్తవ జంటను( Christian Couple ) అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇదే విషయాన్ని అక్కడి స్థానిక మీడియాలు తెలపడంతో అంతర్జాతీయ మీడియాలకు కూడా ఈ వార్త పాకింది.

ఇదే విషయంపైన హర్బన్స్ పురాకు చెందిన తైమూర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అతను రేంజర్స్ ప్రధాన కార్యాలయానికి సమీపంలోని ఒక వీధిలోని ఒక ఫుడ్ షాప్ వద్ద నిలబడి ఉండగా, ఆ దగ్గరలోని ఇంటి పైకప్పు నుండి కొన్ని పేజీలు విసిరివేయబడటం చూశానని, ఆ పేపర్లు ఖురాన్‌కు సంబంధించినవి అని అతడు చెప్పాడని అక్కడి డాన్ పత్రిక రిపోర్ట్‌ చేసింది.ఈ క్రమంలో ఆ ఇంటి వద్దకు వెళ్లి తలుపు తట్టినట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు.

ఒక మహిళ తలుపు తెరిచి తన మైనర్ కుమార్తెలు, కొడుకు పేపర్లను విసిరి ఉండవచ్చని మహిళ ప్రతిస్పందించిందని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు సదరు వ్యక్తి.

Advertisement

ఈ నేపధ్యంలోనే మిస్లింల పవిత్ర గ్రంథాన్ని అపవిత్రం చేశారనే ఆరోపణలపై నార్త్ కంటోన్మెంట్ పోలీసులు( North Cantonment Police ) మహిళ, ఆమె భర్తపై దైవదూషణ కేసు( Blasphemy Case ) నమోదు చేశారు.పాకిస్థాన్ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295-బి కింద కేసు నమోదు చేశారు.నిందితులిద్దరినీ అరెస్టు చేశామని, ఇప్పుడు చట్టపరమైన చర్యల కోసం ఎదురుచూస్తున్నామని ఎస్పీ అవైస్ షఫీక్ మీడియాకు చెప్పుకొచ్చారు.

ఆగష్టు 16న హింసాత్మక ఎపిసోడ్ నేపథ్యంలో ఒక గుంపు దాదాపు 2 డజన్ల చర్చిలను దోచుకోవడం, నిప్పంటించడం, క్రిస్టియన్ కమ్యూనిటీ సభ్యుల ఇళ్లపై దాడి చేయడం, జరన్‌వాలాలోని అసిస్టెంట్ కమీషనర్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న విషయాన్ని మీరు వినే వుంటారు.

Advertisement

తాజా వార్తలు