టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య.
గత నెల సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపుగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.
అయితే సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్ ఇలా మూడు సినిమాలు వరుసగా నిరాశపరిచినప్పటికీ వాల్తేరు వీరయ్య సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు మెగాస్టార్.
ఇక ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి తన తదుపరి సినిమా భోళా శంకర్ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు.ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో ఇంటర్వెల్ బ్లాక్ కు సంబంధించిన ఒక రియల్ వీడియోని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వాల్తేరు వీరయ్య సినిమా ఇంటర్వెల్ సీన్ లో మలేషియాలో విలన్ బాబీ సింహాను ఏనుగు సీక్వెన్స్ లో చంపేసిన హైలెట్ గా నిలిచిందని చెప్పవచ్చు.
తాజాగా గా రియల్ లైఫ్ లో ఒక ఏనుగు కారుపై ఎక్కిన రియల్ సీన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు మెగాస్టార్.ఇకపోతే వాల్తేరు వీరయ్య సినిమా ఈనెల 27 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లో విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే మెగాస్టార్ తన తదుపరి సినిమా భోళా శంకర్ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుపెట్టిన విషయం తెలిసిందే.ఆ సినిమా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో పడ్డారు మెగాస్టార్ చిరంజీవి.
ఈ క్రమంలోనే తాజాగా సినిమా షూటింగ్ మొదలవుతోంది అంటూ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.