మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఈ స్థాయికి ఎదగడంలో ఉన్న కష్టం అంతాఇంతా కాదు.చిరంజీవి ఎంతో కష్టపడటం వల్లే మెగా ఫ్యామిలీకి ఈ స్థాయిలో గుర్తింపు వచ్చింది.
ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్న చిరంజీవి ఆ మొత్తంలో 20 శాతం వరకు సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారు.అయితే చిరంజీవి చదువుకునే కాలేజ్ కోసం( College ) తాజాగా సాయం చేయగా ఆ సహాయం హాట్ టాపిక్ అవుతోంది.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.చిరంజీవి వైఎన్ కాలేజ్ లో( YN College ) చదువుకోగా ఈ కాలేజ్ అభివృద్ధి కోసం ఆయన ఏకంగా 50 లక్షల రూపాయలు ఇచ్చారని తెలుస్తోంది.
గతంలో చిరంజీవి ఎంపీగా పని చేశారనే సంగతి తెలిసిందే.ఆ సమయంలో ఎంపీ నిధుల నుంచి మెగాస్టార్ చిరంజీవి ఈ మొత్తం సహాయం చేశారు.ఈ సహాయం ద్వారా చిరంజీవి చదువుకున్న కాలేజ్ రుణం తీర్చుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
చిరంజీవితో పాటు ఆ కాలేజ్ లో చదివిన మరి కొందరు సినీ ప్రముఖులు సైతం ఆ కాలేజ్ కోసం భారీ మొత్తంలో సహాయం చేశారని సమాచారం అందుతోంది.భవిష్యత్తులో కాలేజ్ అభివృద్ధికి డబ్బు అవసరమైతే తన సొంత డబ్బును ఇస్తానని మెగాస్టార్ చెప్పారని బోగట్టా.ఈ మధ్య కాలంలో ఇతరులకు సహాయం చేసే మనస్సు ఎక్కువమందికి ఉండటం లేదని ఆ విషయంలో చిరంజీవి గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాకే పరిమితం కాగా కీర్తి సురేష్ డేట్ల వల్ల ఈ సినిమా అంతకంతకూ ఆలస్యమవుతోందని తెలుస్తోంది.ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాతో తమన్నా భారీ బ్లాక్ బస్టర్ సాధించాల్సి ఉంది.