ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే సంగతి తెలిసిందే.కొన్నేళ్ల క్రితం బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉండగా ఆ తర్వాత వేర్వేరు కారణాల వల్ల రాజకీయాలకు దూరమయ్యారు.
అయితే బండ్ల గణేష్ జనసేన పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.బండ్ల గణేష్ తాజాగా సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేయగా ఆ ట్వీట్ వైరల్ అవుతోంది.
చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.పవన్ అభిమానులు మాత్రం చిరంజీవి రాజకీయాల్లో యాక్టివ్ అయితే బాగుంటుందని జనసేనకు చిరంజీవి మద్దతు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారు.
కేఎన్ సింహా అనే వ్యక్తి ట్విట్టర్ లో చిరంజీవి గారు జనసేన పార్టీలోకి వచ్చి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు.చిరంజీవి స్టామినా ఏంటో చూపించాలని అంధకారంలో ఉన్న ఏపీ ప్రజలను ఆదుకోవాలని ఆ వ్యక్తి కామెంట్లు చేశారు.
చిరంజీవిలో రాముడిలో ఉన్న సౌమ్యం ఉందని లక్షణుడిలో ఉన్న తెగింపు పవన్ కళ్యాణ్ దని కేఎన్ సింహ ట్వీట్ లో పేర్కొన్నారు.చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిస్తే శ్రీరామరాజ్యం అవుతుందని ఆయన వెల్లడించారు.
జై జనసేన జై పవన్ కళ్యాణ్ అంటూ కేఎన్ సింహ తన ట్వీట్ ను ముగించారు.ఈ ట్వీట్ గురించి బండ్ల గణేష్ స్పందిస్తూ మరి నేను అంటూ కామెంట్ చేయడం గమనార్హం.

బండ్ల గణేష్ ప్రస్తుతం డేగల బాబ్జీ అనే సినిమాలో నటిస్తుండగా ఆ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది.బండ్ల గణేష్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బండ్ల గణేష్ తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని చెప్పకనే చెప్పేశారు.జనసేనలో బండ్ల గణేష్ చేరితే ఎమ్మెల్యే లేదా ఎంపీ పదవికి పోటీ చేస్తారేమో చూడాల్సి ఉంది.