మెగా ప్యాన్స్ ను కంగారు పెడుతున్న కొరటాల శివ నత్త నడక

ఏదైనా సినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్ వసూళ్లను దక్కించుకోవాలి అంటే కచ్చితంగా విడుదలకు రెండు మూడు వారాల నుండి ప్రమోషన్ కార్యక్రమాలతో ఊదరకొట్టాలి.

ఎక్కడ చూసినా కూడా ఆ సినిమాకి సంబంధించిన వార్తలు, సినిమాకి సంబంధించిన చర్చలు జరిగినట్లయితే అప్పుడు సినిమాపై అంచనాలు భారీగా పెరిగి మొదటి వారం రోజులు లేదంటే కనీసం మొదటి మూడు రోజులైనా భారీ వసూళ్లు నమోదు అవుతాయి.

స్టార్ హీరోల సినిమాలకు మొదటి మూడు రోజులు లేదా వారం రోజుల్లో భారీగా వసూళ్లు నమోదు అయితే టాక్ తో సంబంధం లేకుండా బడ్జెట్ రికవరీ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్చరణ్ కీలక పాత్రలో నటించిన ఆచార్య సినిమా ప్రమోషన్ విషయం లో మెగా ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చాలా నత్త నడకన సాగుతున్నాయి అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మెగా ఫ్యాన్స్ అసంతృప్తి కి కారణం ఉంది.

దర్శకుడు కొరటాల శివ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ఇన్ని రోజుల పాటు పెద్దగా పట్టించుకోలేదు.చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ విషయం లో పెద్దగా ఆసక్తి చూపించినట్లు కనిపించ లేదు.

Advertisement

దాంతో ఇన్ని రోజుల పాటు సినిమా కు హడావుడి లేకపోవడం తో ఇప్పుడు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా జనాల్లోకి చొచ్చుకుని పోయే విధంగా మాత్రం కనిపించడం లేదు.

సినిమా సూపర్ హిట్ అయితే తప్ప భారీ వసూళ్ల ను నమోదు చేయడం కష్టం అంటూ మెగా అభిమానులు స్వయంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దర్శకుడు కొరటాల శివ సినిమా అద్భుతంగా తెరకెక్కించాడు, కానీ ఆయన ప్రమోషన్ విషయం లో మాత్రం ఎప్పటికప్పుడు విమర్శలు ఎదుర్కొంటు ఉన్నాడు.గతంలో కూడా ఆయన మహేష్ బాబు తో తెరకెక్కించిన సినిమా ప్రమోషన్ విషయం లో విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఆచార్య సినిమా ప్రమోషన్ విషయం లో ప్లాప్ అయినా కూడా కంటెంట్‌ విషయం లో తప్పకుండా విజయాన్ని సాధించి, భారీ వసూళ్లు నమోదు చేస్తుందేమో చూడాలి.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు