కన్నుమూసిన టీడీపీ సీనియర్ నేత.. ?

పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతు ఈ రోజు కన్నూ మూశారు.

కాగా డాక్టర్ కర్రా రాజా రావు కొన్ని రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా నిన్న ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం అతనిని హైదరాబాదులోని ఓ ఆసుపత్రికి తరలించారట.

ఈ క్రమంలో చికిత్స పొందుతున్న రాజా రావు ఈ రోజు అనగా శనివారం తుది శ్వాస విడిచారని సన్నిహితులు పేర్కొన్నారు.ఇకపోతే చింతలపూడి నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున రాజారావు పోటీ చేసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత చింతలపూడి నియోజక వర్గానికి టీడీపీ తరపున కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు కొనసాగుతున్నారు.ఇక ఈయనకు భార్యా, ఇద్దరు కుమారులు ఉన్నారు.

కాగా రాజారావు మృతి పట్ల టీడీపీ నేతలు పలువురు తమ సంతాపం తెలియజేశారు.

Advertisement
వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!

తాజా వార్తలు