కోనసీమలోని గోదావరి వరదల వల్ల నష్టపోయిన లంక గ్రామాల ప్రజలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు.ఈరోజు ఉదయం తాడేపల్లి నుంచి నేరుగా గంటి పెదపూడి కి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న ముఖ్యమంత్రి వశిష్ట గోదావరి నదిలో లాంచీ లో ప్రయాణం చేశారు.
అనంతరం ట్రాక్టర్ పై ఎక్కి పి గన్నవరం మండలంలోని పుచ్చకాయల వారి పేట, ఉడిముడి లంక, బూరుగులంక, అరిగిల వారి పేట, ప్రాంతాల్లో పర్యటించారు.కొన్ని ప్రాంతాల్లో కాళీ నడకన బాధితులు వద్దకు వెళ్లి వరదల్లో ప్రభుత్వ సహాయక చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు.
శిబిరాల్లో బాగా చూసుకున్నారా అని వరద బాధితులు ప్రశ్నించారు.జిల్లా కలెక్టర్కు ఎన్ని మార్కులు వేయవచ్చు అని వరద బాధితులను ముఖ్యమంత్రి అడిగారు.
ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతంలో వాలంటీర్లు బాగా చూసుకున్నారని వరద బాధితులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెప్పారు.ఒకపక్క వాతావరణం అనుకూలించక పోయిన మరో పక్క వర్షం పడుతున్న కొనసీమ లంక గ్రామాల్లో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగుతోంది.







