ఏపీ సీఐడీ పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, చింతకాయల విజయ్ నివాసాల్లోకి పోలీసులు చొరబడటాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు.
ఇంట్లో ఉన్న ఆడవారిని, చిన్న పిల్లలను, పని వారిని భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు.సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని వ్యాఖ్యనించారు.
చిన్నారులను పోలీసులు భయపెట్టే స్థాయికి సీఎం జగన్ దిగజారారని విమర్శించారు.నోటీసులు ఇవ్వడానికే వెళ్తే డ్రైవర్ పై దాడి ఎందుకు చేశారని ప్రశ్నించారు.
పోలీసులను రౌడీల్లా విపక్ష నేతలపైకి జగన్ ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు.అయ్యన్నపాత్రుడు కుటుంబంపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు.
సీఐడీని అడ్డుపెట్టుకొని పరిపాలన చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.