టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఎమ్మెల్యేలు రూ.15 కోట్లకు అమ్ముడుపోయింది కాక గొప్ప పని చేసినట్లు కలరింగ్ ఇస్తున్నారని విమర్శించారు.ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరికిపోయారన్న విషయాన్ని గుర్తు చేశారు.
కేసీఆర్ తన్నితే చంద్రబాబు అమరావతిలో పడ్డారని మంత్రి దాడిశెట్టి ఎద్దేవా చేశారు.అంతేకాకుండా అమరావతి పేరుతో స్కామ్ చేశారని ఆరోపించారు.