ఇన్చార్జిలకు వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు..!!

వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో కృషి చేస్తున్నారు.

ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం చేసే ప్రతి తప్పు విషయంలో తనదైన శైలిలో ప్రశ్నిస్తూనే మరో పక్క న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు.

అంత మాత్రమే కాక మరో పక్క తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని కాపాడుకుంటూ పార్టీలో కొత్త నాయకులని తయారు చేసే రీతిలో యువకులకు ఎక్కువగా పార్టీ పదవులు కట్టబెడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో గతంలో నియోజకవర్గాల ఇన్చార్జిలు నియమించడం జరిగింది.

ఈ పరిస్థితిలో ఉంటే తాజాగా కొత్తగా నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు చేపట్టిన వారిని ఉద్దేశించి చంద్రబాబ.సంచలన వార్నింగ్ ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలంటే కచ్చితంగా tపని చేయాల్సిందే  అని తెలిపారు.పని చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే బాగోదు పని చేయడం చేతకాక పోతే దండం పెట్టి పక్కకు వెళ్లిపోండి.

Advertisement

అని కరాఖండిగా తెలియజేశారు.పనిచేయని వారి స్థానంలో కొత్త వారికి పదవులు అప్ప చెబుతామని, రాష్ట్రంలో పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కష్టపడాలని తెలిపారు.

పని చేయకుండా పదవులు వచ్చేయాలి, రాష్ట్రంలో.మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలి అనుకుంటే అది జరిగే పని కాదని అన్నారు.

అధికార పార్టీ వైసీపీ నేతలతో డి అంటే డి అనే రీతిలో.ఇన్చార్జిలు ఉండాలని చంద్రబాబు తెలిపారు.

ఉల్లి తొక్కలను పారేస్తున్నారా.. జుట్టుకు ఇలా వాడితే బోలెడు లాభాలు!
Advertisement

తాజా వార్తలు