టీడీపీ గెలవడం చారిత్రాత్మక అవసరం! చంద్రబాబు!

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకి పదును పెడుతూ ప్రజలని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.ఇక అధికార టీడీపీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎన్నికల కసరత్తు మొదలెట్టి నియోజక వర్గాల వారీగా ఓ వైపు అభ్యర్ధులని ఎంపిక చేస్తూనే మరో వైపు నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నివర్హిస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.

 Chandrababu Naidu Calls For Protest Against Pm-TeluguStop.com

రానున్న ఎన్నికలలో టీడీపీ మళ్ళీ గెలవడం చారీత్రాత్మక అవసరం అని చెప్పిన చంద్రబాబు, దానికోసం అందరూ కలిసి పని చేయాలని, విభేదాలు మరిచి ఒకటిగా పనిచేస్తే టీడీపీ గెలుపుని ఎవరు ఆపలేరని చంద్రబాబు తెలియజేసారు.

అప్పట్లో తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం కేంద్రంతో ఎన్టీఆర్ ఎలా పోరాటం చేసారో మహానాయకుడు సినిమాలో చూపించారని, ఇప్పుడు మరల కేంద్రంతో నేను పోరాటం చేస్తున్నా అని, ఈ కారణంగా మహానాయకుడు సినిమాని ప్రజలలోకి తీసుకెళ్ళి, తెలుగు దేశం ఆశయాలు, సిద్ధాంతాలని ప్రజలలోకి తీసుకెళ్లాలని చెప్పారు.

అలాగే మోడీ విశాఖ పర్యటనలో అందరూ నిరసన తెలియజేసి గట్టిగా నిలదీయాలని, విభజన హామీలు, ప్రత్యెక హోదాపై విషయంలో ఏపీ ప్రజలని మోసం చేసిన మోడీ క్షమాపణ చెప్పిన తర్వాతనే ఏపీలో అడుగుపెట్టాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో జరిగిన కాన్ఫరెన్స్ లో సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube