ఉనగట్లలో రైతుల సమస్యలు తెలుసుకున్న చంద్రబాబు..!!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు( Chandrababu Naidu ) తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలంలో ఉనగట్లలో.రైతులను పరామర్శించారు.

 Chandrababu Knows The Problems Of Farmers In Unagatla , Chandrababu, Tdp-TeluguStop.com

ఇటీవల అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు.

రైతులు సమస్యలు ఎదుర్కొంటుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.తాను రైతులను పరామర్శించడం మొదలుపెట్టాక ప్రభుత్వంలో కదలిక వచ్చిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ఉభయగోదావరి జిల్లాలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అన్నారు.

అకాల వర్షాల కారణంగా 50% ఇంకా నీటిలోనే మునిగిపోయింది.వచ్చిన పంటలో 15 నుంచి 20 శాతం మాత్రమే కొనడం జరిగింది.మిగిలిన నీట మునిగిన పంట సంగతి ఏమిటని.

ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించడం జరిగింది.ఇదే సమయంలో ప్రభుత్వం రైతుల పంటలకు బీమా చేయించలేదని.

ప్రీమియం చెల్లించలేదని విమర్శించారు.రైతు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ప్రీమియం చెల్లించి ఇన్స్యూరెన్స్ కల్పిస్తారని.

రబీకి ఈ ప్రభుత్వం కట్టలేదన్నారు.రాష్ట్రవ్యాప్తంగా రైతులు పడుతున్న ఇబ్బందుల వీడియోలు తీయాలని సూచించారు.

టీడీపీ ( TDP )అధికారంలోకి వచ్చాక ధాన్యం ఆరబోసేందుకు ప్లాట్ ఫారలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతూ ఎన్నికల మేనిఫెస్టో రూపొందిస్తామని చంద్రబాబు ఈ పర్యటనలో రైతులకు హామీ ఇవ్వడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube