ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల( Dwaraka Tirumala )లో కృష్ణాజిల్లా చల్లపల్లి అబ్బాయికి తైవాన్( Taiwan ) దేశానికి చెందిన అమ్మాయికి ఈనెల 2వ తేదీ వివాహం జరిగింది.ఈ వివాహాన్ని పూర్తిగా హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిపించారు.
వధువు, ఆమె తల్లిదండ్రులు హిందూ సాంప్రదాయ రీతిలో వస్త్రాలు ధరించి వివాహ వేడుకను శాస్త్రవేత్తంగా నిర్వహించారు.అలాగే తైవాన్ దేశం నుంచి వచ్చిన వధువు బంధువుల సైతం హిందూ సాంప్రదాయ ఆచారాలను పాటించడం పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వరుడు సాయి దినకర్( Sai Dinakar ) తైవాన్ దేశంలో సించున్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు.అక్కడే ఫిజియోథెరపిస్ట్ గా పని చేస్తున్న యు టింగ్ నియో అనే ఆమెతో పరిచయం మొదలై ఆ పరిచయం ప్రేమగా మారింది.
దీంతో ఇరువు పెద్దలను ఒప్పించి వారి ప్రేమ పెళ్లి పీటలకు చేరింది.ద్వారకా తిరుమల చిన వెంకన్న సన్నిధిలో వారి వివాహం ఘనంగా జరిగింది.







