కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ 2023 అవార్డు అందుకున్న సర్పంచ్ పాలకవర్గం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddipet ) మేజర్ గ్రామ పంచాయతీ కి కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ 2023 అవార్డును అడిషనల్ కలెక్టర్ గౌతం రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణ, జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు, ఎంపిడిఓ బింగి చిరంజీవి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో అవార్డును సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి కి,పాలకవర్గం కు అందజేశారు.

గ్రామ పాలక వర్గం సమిష్టి కృషి,ప్రజల సహకారంతో అవార్డు అందుకున్నట్లు సర్పంచ్ వెంకట్ రెడ్డి తెలిపారు.

ఒగ్గు రజిత బాలరాజు యాదవ్( Ogg Rajitha Yadav ),జవ్వాజి లింగం, బ్యాలకంటి దేవేందర్, కొడిమోజు దేవేందర్, ద్యాగం లక్ష్మి నారాయణ,పందిర్ల శ్రీనివాస్, గడ్డమీది లావణ్య, ఎనగందుల అంజలి, కో ఆప్షన్ సభ్యులు నాగుల రజనీ, ఎనగందుల బాబు ఎంపిఓ వజీర్, రెడ్డి సంఘం మండల మాజీ అద్యక్షులు గన్న మల్లారెడ్డి , గన్న బాల్ రెడ్డి,సాన పర్శరాములు, పంచాయతీ కార్యదర్శి దేవరాజు లు ఉన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News