వివాదాస్పద ట్వీట్ చేసిన కేంద్రమంత్రి... హెచ్చరించిన షా

హిందుత్వ భావజాలం కలిసిన బీజేపీ నేత,కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గట్టి వార్ణింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.మొన్నటి కి మొన్న హోం శాఖ సహాయక మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై షా కిషన్ రెడ్డిని మందలించిన సంగతి తెలిసిందే.

 Central Minister Giriraj Controversial Comments On Jdu-TeluguStop.com

అయితే ఇప్పుడు తాజాగా గిరిరాజ్ సింగ్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తో షా రంగంలోకి దిగి గిరి రాజ్ కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.పార్టీని, భాగస్వామ్య పార్టీలతో సంబంధాలను చిక్కుల్లో పెట్టే విధంగా అనవసర వ్యాఖ్యలు చేయవద్దని.

ఇలాంటి తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని అమిత్ షా కేంద్రమంత్రి గిరిరాజ్‌ను హెచ్చరించారు.బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీజేపీ, ఎల్జేపీ నేతలను ఎగతాళి చేస్తూ గిరిరాజ్ సింగ్ ఓ ట్వీట్ చేశారు.

-Telugu Political News

నితీష్‌తో కలిసి సుశీల్‌కుమార్‌ మోదీ, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌, చిరాగ్‌ పాశ్వాన్‌ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలను ఆయన షేర్ చేస్తూ ‘నవరాత్రి రోజుల్లో ఫలాహారం ఏర్పాటు చేసి ఇలాంటి ఫొటోలు తీసుకుంటే అవి ఎంత అందంగా ఉండేవో!.మనం మన మతానికి సంబంధించిన కర్మ, ధర్మాలను ఆచరించడంలో నిరాసక్తంగా ఉంటాం కానీ వేరే మతంపై ప్రేమను నటించడంలో ముందుంటాం’ అని రాశారు.అయితే గిరిరాజ్‌ ట్వీట్‌పై జేడీయూ, ఎల్జేపీ నేతలు అసంతృప్తి, విమర్శలు వ్యక్తం చేయడంతో అమిత్‌ షా రంగంలోకి దిగి భవిష్యత్తు లో మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగోదు అంటూ ఘాటుగా హెచ్చరించినట్లు తెలుస్తుంది.ఇప్పటికే బీజేపీ, జేడీయూ మధ్య దూరం పెరుగుతున్న ఈ సమయంలో గిరిరాజ్ వ్యాఖ్యలు అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube