పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం నిర్వహించింది.ఈ మేరకు జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో భేటీ ఏర్పాటైంది.
గత కొంతకాలంగా జరుగుతున్న పనుల పురోగతితో పాటు సహాయ పునరావాస కార్యక్రమాల అమలు తీరుపై అధికారులు సమీక్షిస్తున్నారని తెలుస్తోంది.అయితే ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశం అయిన సంగతి తెలిసిందే.