ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం

ఢిల్లీలో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించనుంది.ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులతో సీఈసీ భేటీ కానుంది.

తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ తో పాటు మిజోరాం ఎన్నికల పరిశీలకులతో అనేక అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్చించనుంది.సజావుగా ఎన్నికల నిర్వహణతో పాటు మద్యం, డబ్బు అక్రమ రవాణాను అరికట్టడం, ఎన్నికల ప్రవర్తన నియమావళి కఠినంగా అమలు చేయాలని అవగాహన కల్పించనుంది.

అదేవిధంగా ఎన్నికల పరిశీలకులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.కాగా ఇప్పటికే కేంద్ర ఎన్నికల బృందం ఈ రాష్ట్రాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.

అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత
Advertisement

తాజా వార్తలు