ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.రైల్వే బోర్డు సిఫారసు మేరకు సీబీఐ రంగంలోకి దిగింది.
కాగా ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాద ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఘటన జరగడానికి మానవ తప్పిదమా.? లేదా కుట్ర కోణం ఉందా అన్న అంశాలపై సీబీఐ విచారణ కొనసాగుతోంది.సిగ్నలింగ్ వ్యవస్థపై కూడా సీబీఐ దర్యాప్తు పూర్తి స్థాయిలో కొనసాగుతోంది.