చైనా: ఛీ, సడన్‌గా సెప్టిక్ ట్యాంక్ పైప్‌లైన్ పగలడంతో అందరిపైకి చిమ్మిన మలం..?

సెప్టిక్ ట్యాంక్( Septic Tank ) చూస్తేనే మనకి కంపరంగా ఉంటుంది.అభివృద్ధి చెందిన పెద్ద దేశాలలో సెప్టిక్ ట్యాంక్‌ పైప్‌లైన్ సిస్టం ఏర్పాటు చేస్తుంటారు.

అయితే చైనాలో( China ) ఏర్పాటు చేసిన అలాంటి పైప్‌ ఇటీవల పగిలిపోయింది.నానింగ్( Nanning ) అనే నగరంలో కొత్తగా ఇన్‌స్టాల్ చేసిన ఆ మురుగునీటి సెప్టిక్ పైప్ ఒక పరీక్ష సమయంలో పగిలిపోయింది.

దీంతో మానవ మలం, మూత్రం 33 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డాయి! ఒక కారు డ్యాష్‌క్యామ్‌ కెమెరా ఈ దృశ్యాన్ని రికార్డ్ చేసింది.అది ఒక పసుపుపచ్చ వాటర్ ఫౌంటెన్ లాగా కనిపించిందట.

మలం, మూత్రం కలిసి రోడ్డు మీద పెద్ద ఎత్తున పడిపోయింది.దీంతో ఒక కారు విండ్‌స్క్రీన్ దాదాపు పగిలిపోయింది.

Advertisement

బైక్‌పై వెళ్లేవారు, నడుస్తున్నవారు ఈ దుర్గంధపు నీటి గుండా వెళ్లాల్సి వచ్చింది.అయితే, ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

మరొక వీడియోలో ఈ లెట్రిన్ వాటర్ ఫౌంటెన్ ఎంత ఎత్తుకు ఎగసిపడిందో కనిపించింది.అది భూమి నుంచి నీరు బయటకు వచ్చే జలాశయం లాగా ఉంది.

పేలుడు( Explosion ) జరిగిన తర్వాత, రోడ్లు మొత్తం మానవుల మలం, మూత్రం నీటితో నిండిపోయాయి.

ఈ పైప్‌ను అనుభవజ్ఞులైన ఇంజనీర్లు పెట్టారు.వారు పైప్ బాగా పని చేస్తుందో లేదో చూడడానికి ఈ పరీక్ష చేస్తున్నారు.అప్పుడు ఈ ప్రమాదం జరిగింది.

రోజమ్మ నా అమ్మ.. వైరల్ అవుతున్న రాకింగ్ రాకేష్ ఎమోషనల్ కామెంట్స్!
ఠాగూర్ సినిమా వల్ల డాక్టర్ల బ్రతుకులు నాశనం.. ప్రముఖ డాక్టర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

చైనాలో కొత్తగా పెట్టిన పైప్‌లు ఎక్కువ కాలం బాగా పని చేస్తాయో లేదో చూడడానికి ఇలాంటి పరీక్షలు చేస్తారు.కానీ, ఈసారి ఈ పరీక్ష అనుకోకుండా విషాదంగా మారింది.

Advertisement

సెప్టిక్ ట్యాంక్ ప్రమాదం గురించి కొన్ని కొత్త విషయాలు తెలిశాయి.

ఈ ప్రమాదానికి కారణం సెప్టిక్ ట్యాంక్ లైన్ పగిలిపోవడమే అని అధికారులు చెప్పారు.రోడ్డు నిర్మాణ సమయంలో ఏదైనా తగిలి పగిలిందని ముందు చెప్పిన విషయం తప్పు అని తేలింది.ఇంజనీర్లు గొట్టం బాగా పని చేస్తుందో లేదో చూడడానికి పరీక్ష చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.

ఈ వీడియోను ఇప్పటికే 3 లక్షల మంది చూశారు.చాలా మంది ఈ వీడియో చూసి నవ్వుకున్నారు.

కొంతమంది ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారు.వారు తక్కువ ఖర్చుతో పనులు చేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు.

"నా కారు మొత్తం సెప్టిక్ వేస్టేజీతో నిండిపోయింది.ఇక దాన్ని వాడలేను" అని ఒక వ్యక్తి బాధపడ్డాడు.

తాజా వార్తలు