కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ..

టీమ్ ఇండియా, శ్రీలంక జట్లు ఇప్పటికే ఒక టీ20 సిరీస్ ఆడిన విషయం తెలిసిందే.

ఈ రోజు అంటే మార్చి 4 నుంచి ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభమయ్యింది.

ప్రస్తుతం ఇండియా బ్యాటింగ్ చేస్తోంది.అయితే ఈ టెస్ట్ సిరీస్ కు ముందు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.100 టెస్ట్ ఆడబోతున్న విరాట్ కోహ్లీకి అడ్వాన్స్ గా శుభాకాంక్షలు తెలిపారు.అలానే టెస్టుల్లో టీం ఇండియా నంబర్ వన్ స్థానానికి రావడానికి ముఖ్య కారణం కోహ్లీ అని రోహిత్ ప్రశంసల వర్షం కురిపించారు.

కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే సమయానికి భారత జట్టు 7వ స్థానంలో ఉందని కానీ ఆ తర్వాత ఐదేళ్ల పాటు వరుసగా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ప్లేస్ లో ఉందని గుర్తుచేశారు.దీనంతటికీ కారణం కోహ్లీ అని కొనియాడాడు.

అంతేకాదు విరాట్ ఒక స్పెషల్ ప్లేయర్ అని, అతడు ఆడనున్న 100వ టెస్ట్ మ్యాచ్ ను మరింత స్పెషల్ చేయాలని తాను అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.

Advertisement

కోహ్లీ టెస్ట్ కెప్టెన్ గా రాణిస్తూ ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను భారతదేశానికి సాధించిపెట్టాడని రోహిత్ ప్రశంసించారు.2018లో ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ విజయం ఎంతో ప్రత్యేకమని ఆ గెలుపు లో కోహ్లీ పాత్ర ఎంతో ఉందని వెల్లడించాడు.2013లో దక్షిణాఫ్రికాలోని బౌన్సీ పిచ్ పై తనతో కలిసి కోహ్లీ సాధించిన క్లాసీ టెస్ట్ సెంచరీలను ఏ క్రికెట్ అభిమాని కూడా మర్చిపోలేరని రోహిత్ వెల్లడించారు.ఇదిలా ఉండగా శుక్రవారం అంటే నేడు రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మొహాలీ వేదికగా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది.

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీ ఛానెల్‌ల్లో ఈ మ్యాచ్ ను చూడొచ్చు.

Advertisement

తాజా వార్తలు