కృష్ణా జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర( Memantha Siddham Bus Yatra ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే.దాడి తరువాత పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజల ఆశీర్వాదంతో తనకు ప్రాణాపాయం తప్పిందని సీఎం జగన్( CM Jagan ) తెలిపారు.ఇటువంటి దాడులతో తన ప్రయాణాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే ధైర్యంతో ముందడుగు వేద్దామన్న సీఎం జగన్ ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.అయితే దాడి జరిగిన నేపథ్యంలో నిన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సీఎం జగన్ తాత్కాళిక విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇవాళ మళ్లీ బస్సు యాత్ర ప్రారంభించిన సీఎం జగన్ పర్యటనను కొనసాగిస్తున్నారు.