ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది.
ఇప్పటికే ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా .కెనడాలోని వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని భారత్ మూసివేసింది.ఇరుదేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.ఇదిలావుండగా .కెనడా సైతం భారత్లోని తన దౌత్యవేత్తలను 62 నుంచి 21కి తగ్గించడంతో వీసా జారీ ప్రక్రియకు తీవ్ర విఘాతం కలుగుతోంది.అంతర్జాతీయ విద్యార్ధులు , భారత్ నుంచి కెనడా వెళ్లాల్సిన వారిపై ఇది ప్రభావం చూపుతోంది.
తర్వాత భారతీయ కెనడియన్ల విజ్ఞప్తి మేరకు వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని( Visa Processing Center ) ఇండియా పునరుద్ధరించింది.

తాజాగా నిజ్జర్ హత్యపై ట్రూడో మరోసారి స్పందించారు.ఈ ఘటనపై న్యూఢిల్లీతో( New Delhi ) నిర్మాణాత్మకంగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రూడో వెల్లడించారు.బుధవారం వాంకోవర్లో మీడియాతో మాట్లాడుతూ .కెనడియన్లు ఎవరూ మరోసారి ప్రమాదానికి గురికాకుండా చర్యలు చేపడతామన్నారు.నిజ్జర్ హత్యపై ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ)( Integrated Homicide Investigation Team ) దర్యాప్తు చేపట్టి నెలలు గడుస్తున్నప్పటికీ నేటి వరకు ఎలాంటి అరెస్ట్లు కానీ , ఆధారాలు కానీ లభించలేదు.
గతేడాది జూన్ 18న సర్రేలోని గురుద్వారా పార్కింగ్ ప్లేస్లో హర్దీప్ సింగ్ నిజ్జర్ను ముసుగులు ధరించిన దుండగులు కాల్చి చంపారు.

మరోవైపు .గతేడాది న్యూయార్క్లో ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) న్యాయవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ను( Gurpatwant Singh Pannun ) హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో భారత్ ఉన్నత స్థాయి విచారణను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఆ విచారణ నిజ్జర్ కేసును ఇంకా తాకలేదని భారత ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ప్రభుత్వానికి సమర్పించాల్సిన నివేదిక వివరాలు వేచి వున్నాయని చెప్పారు.నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ఎలాంటి నిర్ధిష్ట సమాచారాన్ని అందించలేదని ఆయన పేర్కొన్నారు.