ప్రస్తుత కాలంలో ఎటువంటి సమస్యలకైనా హత్యలే పరిష్కారం అవుతున్నాయి.ఆస్తుల తగాదాలు, అక్రమ సంబంధాలు, వివిధ రకాల మోసాలు లాంటివి చివరికి హత్యల వరకు వెళుతున్నాయి.
సమాజంలో రోజురోజుకు మానవత్వానికి చోటు కరువు అవుతోంది.ఆస్తి తగాదాలు ఉండడంతో పథకం ప్రకారం ఆస్ట్రేలియా నుండి పిలిపించి.
గ్రాండ్ గా మందు పార్టీ ఇచ్చి హత్య చేసిన సంఘటన కరీంనగర్( Karimnagar ) లోని సంతోష్ నగర్ లోని ప్రజలను షాక్ కు గురిచేసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ లోని సంతోష్ నగర్ లో పురంశెట్టి నరసింహారావు అనే వ్యక్తి నివాసం ఉంటూ ఆర్టీసీ లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు.
అతని చిన్న కుమారుడు నరేంద్రరావు ఆస్ట్రేలియాలో ఎమ్మెస్సీ పూర్తి చేసి, ఈ మధ్యనే భార్య,కుమార్తెతో కలిసి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యాడు.
నరేంద్రరావు ను కొందరు పార్టీ పేరుతో ఊరికి పిలిపించారు.
బుధవారం సాయంత్రం బయటికి వెళ్లిన నరేంద్రరావు రాత్రి విద్యానగర్ వాటర్ ట్యాంక్ పోలీస్ శిక్షణ కళాశాల దారి మధ్యలో ఉండే ఓ ప్రైవేట్ స్కూల్లో శవమై కనిపించాడు.స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించగా నరేంద్రరావు గొంతుపై, తలపై, పొట్టపై కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
పోలీసులు కుటుంబ సభ్యులను విచారించగా మృతిని తల్లి లక్ష్మి, తన కొడుకుకు భూమికి సంబంధించిన వ్యవహారంలో కొంతమందితో గొడవలు ఉన్నాయని, భూ వివాదంలో భాగంగా ఇంటిపైకి వచ్చి దాడి కూడా చేశారని పోలీసులకు( Police ) తెలిపింది.బుధవారం సాయంత్రం ఇంటి నుంచి తీసుకెళ్లిన వ్యక్తులు పార్టీ చేసుకుంటూ. భూవివాదం( Land disputes ) చర్చకు రావడంతో కోపంతో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.మృతుని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొంతమంది సభ్యులను అదుపులోకి తీసుకొని హత్యకు గల కారణాలేమిటో.
అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేసి నిజమైన దోషులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.