మేడిగడ్డ సందర్శనకు గులాబీ దళం బయలుదేరింది.ఈ మేరకు హైదరాబాద్ లోని తెలంగాణభవన్( Telangana Bhavan ) నుంచి బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల బృందం మేడిగడ్డకు బయలుదేరారు.
బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు దాదాపు 200 మందితో కూడిన బృందం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ( Annaram Barrage )లను సందర్శించనున్నారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టడానికే బీఆర్ఎస్( BRS ) చలో మేడిగడ్డ చేపట్టినట్లు చెబుతోంది.ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.బ్యారేజీలో ఏదైనా లోపం ఉంటే మరమ్మతులు చేయాల్సింది పోయి కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందని బీఆర్ఎస్ మండిపడుతోంది.