బావమరిదిని లాంచ్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్

నందమూరి నటవారసత్వంతో బాలకృష్ణ, హరికృష్ణ తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న నటులుగా పరిచయం అయ్యారు.

వీరిలో ఎన్టీఆర్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని పాన్ ఇండియా స్టార్ గా ఎదిగే క్రమంలో ఉన్నారు.

అయితే ఇప్పుడు తారక్ బ్రాండ్ ఇమేజ్ ఉపయోగించుకొని హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి అతని బావమరిది రెడీ అవుతున్నాడు.నార్నే శ్రీనివాసరావు తనయుడు నార్నె నితిన్ చంద్ర హీరోగా పరిచయం అవుతున్నాడు.

ఎంతో మంది కొత్తవారిని టాలీవుడ్ కి పరిచయం చేసిన దర్శకుడు తేజ చేతుల మీదుగా అతను హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు.ఇప్పటికే నటన, డాన్స్, ఫైట్స్ లో ఆ కుర్రాడు శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తుంది.తేజ చిత్రం సీక్వెల్ గా అదే టెక్నికల్ టీమ్ తో చిత్రం 1.1 సినిమాని ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు ఆ సినిమా కోసం నార్నె నితిన్ మెయిన్ హీరో ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

దాదాపు 40మంది కొత్త నటీనటులతో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు భోగట్టా.నేటితరం యువత జీవనశైలిని ఈ సినిమా ద్వారా ప్రెజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ఏప్రిల్ 18న ఈ సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నారని అదే రోజు ఎన్టీఆర్ తన బావమరిది నితిన్ ని హీరోగా పరిచయం చేస్తాడని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ బావమరిదితో పాటు సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ కూడా మరో హీరోగా పరిచయం అవ్వనున్నట్లు టాక్ వినిపిస్తుంది.త్వరలో వీటికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఎన్టీఆర్ బ్రాండ్ ఈ సినిమాకి ఉండటంతో నందమూరి అభిమానుల నుంచి నార్నే నితిన్ కి సపోర్ట్ దొరికే అవకాశం ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు