సీనియర్ నటుడు నరేశ్ వ్యవహారంలో మరో ట్విస్ట్ నెలకొంది.తాజాగా తనకు ప్రాణహాని ఉందంటూ నరేశ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని తెలుస్తోంది.
రమ్య రఘుపతి, రోహిత్ శెట్టితో తనకు ప్రాణహాని ఉందని నరేశ్ ఆరోపిస్తున్నారు.తన ఆస్తి కాజేయడానికి రమ్య ప్రయత్నించిందని, ఒప్పుకోకపోవడంతో తనను చంపేందుకు ప్రయత్నించారని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
అంతేకాకుండా తన పేరు చెప్పి రమ్య లక్షలు అప్పులు చేసిందని నరేశ్ తెలిపారు.ఈ క్రమంలో అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి తనన వేధించేవారన్నారు.
అనంతరం సుపారీ గ్యాంగ్ తో చంపాలని ప్రయత్నించిందని కోర్టుకు విన్నవించినట్లు సమాచారం.