కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ విమర్శలు గుప్పించారు.ప్రభుత్వ పథకాలకు కేసీఆర్ పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు.
కేంద్ర పథకాలకు ఎక్కడా మోదీ పేరు పెట్టలేదని చెప్పారు.ఈ నేపథ్యంలో పథకాలకు కేసీఆర్ పేరు పెట్టడంపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
ఇప్పటికీ రైతు ధాన్యం రిడ్లపైనే ఎండబోస్తున్నారని పేర్కొన్నారు.కల్లాల కోసం ఖర్చుచేశామంటున్న నిధులు ఎటు పోయాయని ప్రశ్నించారు.
దీనిపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని వెల్లడించారు.