తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ( Decade celebrations Telangana state )సందర్భంగా ఖమ్మం( Khammam ) గుమ్మంలో పుస్తక మహోత్సవం ప్రారంభం కానుంది.ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ సౌజన్యంతో తెలంగాణ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలోని లకారం ట్యాంక్ బండ్ ( Lakaram )వద్ద ప్రముఖ పబ్లిషర్స్కు చెందిన 25 స్టాల్స్ తో జూన్ 11 నుంచి 18 వరకు పుస్తక మహోత్సవం జరుగనుంది.
సందర్శన వేళలు: మధ్యాహ్నం 3.00 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు.ఈ వారం రోజుల పుస్తక పండుగను పుస్తక ప్రియులు, విద్యార్థులు, యువతీ యువకులు సందర్శించి, సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ బుక్ ట్రస్ట్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ కోరారు.