ఝుమ్మంది నాదం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు సొట్టబుగ్గల సుందరి తాప్సీ. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం పలు సినిమాలలో నటించే సందడి చేశారు.
ఇకపోతే తెలుగు సినిమాలలో నటించిన ఈమె పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమై వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇక ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా చెప్పే తాప్సి తరచూ పలు వివాదాలను ఎదుర్కొంటూ ఉంటారు.
వివాదాలు ద్వారా తరచు వార్తలలో నిలుస్తున్నటువంటి ఈమె తాజాగా టాలీవుడ్ బాలీవుడ్ సినిమాల గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి తాప్సి తన సినిమాల గురించి మాట్లాడుతూ తాను ఏదైనా ఒక సినిమాను ఎంపిక చేసుకునే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆ పాత్ర నాకు సరిపోతుందా లేదా అని ఆలోచించి సినిమాలకు కమిట్ అవుతానని తెలిపారు.
కెరియర్ మొదట్లో కథల ఎంపిక విషయంలో కొన్ని పొరపాట్లు జరిగినప్పటికీ ప్రస్తుతం చాలా జాగ్రత్తగా కథల ఎంపిక చేసుకుంటున్నానని తెలిపారు.ఇకపోతే నాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో కన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే మంచి పాత్రలు వచ్చాయని నాకు అనుగుణంగా పాత్రలు బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎక్కువగా చేశానంటూ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇక ప్రస్తుతం డిజిటల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత థియేటర్ కన్నా ఓటీటీలకే ఎంతో మంచి ఆదరణ పెరిగిందని అందుకే ఎంతోమంది నిర్మాతలు వెబ్ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు.ఇక తనకు తెలుగులో మంచి సినిమాలో నటించాలని ఉందని అవకాశం వస్తే తప్పకుండా తెలుగులో కూడా సినిమాలు నటిస్తానని ఈ సందర్భంగా ఇమేజెస్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.