జనసేన పార్టీలోకి చేరికలు ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.ఏపీలో రాజకీయ ప్రత్యామ్న్యాయం కోసం చూస్తున్నవారు… ప్రస్తుతం తాము ఉన్న పార్టీ లో గెలుపు అవకాశాలు లేకపోవడంతో ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.
ఈ కోవలోనే… బీజేపీ ఎమ్మెల్యే ఒకరు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీ ని వీడి జనసేనలోకి వచ్చేందుకు ముహూర్తం పెట్టుకున్నారు.
బ్రష్టుపట్టిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయగల సత్తా .జనసేన పార్టీకి మాత్రమే ఉందని, అందుకే… తాను ఆ పార్టీలో చేరుతున్న అని ఆకుల ఈ సందర్భంగా చెప్పారు.పవన్ పై తనకు అపార నమ్మకం ఉందని… అందుకే.ఈ నెల 21 న జనసేనలో చేరబోతున్నట్టు ఆకుల తెలిపారు.రాబోయే ఎన్నికల్లో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆకుల తెలిపారు.