తెలంగాణ బీజేపీ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ టీఆర్ఎస్ ను గద్దె దింపాలనే టార్గెట్ గా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.
అయితే ఇటు కాంగ్రెస్ కూడా పోటీ ఇస్తున్న తరుణంలో రాజకీయంగా త్రిముఖ పోటీ నెలకొంది.అయితే అమిత్ షా కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే బీజేపీ వ్యూహాలు బయటపడుతున్న పరిస్థితి ఉంది.
ముందుగా అందరిలో జరుగుతున్న చర్చ గవర్నర్ గా తమిళిసై నియామకం.అయితే గవర్నర్ గా తమిళిసై నియామకం వెనుక వ్యూహం ఏంటనేది ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఇటు బీజేపీ ప్రయోగించే వ్యూహాలకు అనుగుణంగా గవర్నర్ గా తమకున్న విశేష అధికారాలను దృష్టిలో పెట్టుకొని వాటిని ఉపయోగిస్తూ కొంత ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.అయితే ఎంత వరకు తెలంగాణలో బీజేపీ తరహా వ్యూహాలు అమలవుతాయన్నది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో బీజేపీ వేసే అడుగులను బట్టి మనకు మరింతగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
అయితే ఇంకా కెసీఆర్ బీజేపీ విమర్శలపై ప్రత్యక్షంగా స్పందించకపోయినా రానున్న రోజుల్లో సరైన సమయంలో స్పందించే అవకాశం కనిపిస్తోంది.

ఏది ఏమైనా బీజేపీ తగ్గేదె లే అన్న రీతిలో తమకున్న బలాన్ని వందకు వంద శాతం వినియోగిస్తూ ఇక తెలంగాణలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న పరిస్థితి ఉంది.అయితే కెసీఆర్ కూడా తనకున్న రాజకీయ అనుభవాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో వినియోగించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.మరి టీఆర్ఎస్ పై బీజేపీ చేస్తున్న ఈ రాజకీయ పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారనేది మనకు రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.







