మోడీ, అమిత్‌ షాలకు ఇది పెద్ద ఎదురు దెబ్బ

మహారాష్ట్ర మహా ఉత్కంఠకు తెర తొలగింది.ఏదో విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నించిన బీజేపీకి సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది.

 Bjp Leader Fadnavis Resign In Cm Post-TeluguStop.com

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పడ్నవీస్‌ వెంటనే తన బలాన్ని నిరూపించుకోవాలంటూ సుప్రీం ఆదేశించింది.అదే సమయంలో డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్‌ పవార్‌ రాజీనామా చేయడంతో పాటు తన వెనుక ఎమ్మెల్యేలు ఎవరు లేరనే విషయాన్ని గ్రహించాడు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీ బల పరీక్షను నెగ్గడం అసాధ్యం అని భావించిన బీజేపీ పడ్నవీస్‌తో రాజీనామా చేయించింది.

కర్ణాటక తరహా రాజకీయాన్ని చేయాలని చాలా ప్రయత్నించిన బీజేపీ అధినాయకత్వంకు ఎదురు దెబ్బ తలిగింది.

ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు సమయం లేకపోవడంతో పాటు కొన్ని కారణాల వల్ల బీజేపీ వ్యూహం బెడిసి కొట్టింది.సుప్రీం కోర్టు దెబ్బతో మోడీ మరియు అమిత్‌ షాలకు మైండ్‌ బ్లాంక్‌ అయినంత పనైంది.

ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా బీజేపీ ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ వచ్చింది.కాని మొదటి సారి మహారాష్ట్రలో కేంద్ర ప్రభుత్వం సాయంతో కూడా బీజేపీ అధికారం దక్కించుకోలేక పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube