త్వరలో లోక్సభ ఎన్నికలు( Lok Sabha elections ) రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది.ఈ మేరకు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది.
ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిటీ సభ్యులు అందుబాటులో ఉండాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.సుమారు 120 మంది లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ( BJP ) తీవ్ర కసరత్తు చేయనుంది.

పార్లమెంట్ అభ్యర్థుల జాబితా ఖరారు, ప్రకటనపై కూడా నేతలు చర్చించనున్నారు.ఈ క్రమంలోనే మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది.అలాగే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్ర నేతలు హాజరుకానున్నారు.ఈ మేరకు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.
తొలి జాబితాలోనే తెలంగాణ నేతల పేర్లు ఉండేలా కసరత్తు చేస్తుందని సమాచారం.







