BJP: ఏపీలో పొత్తులపై త్వరలో బీజేపీ క్లారిటీ..!

ఏపీలో పొత్తులపై బీజేపీ( bjp ) హైకమాండ్ త్వరలో క్లారిటీ ఇవ్వనుంది.ఈ మేరకు రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ మరియు జనసేన పొత్తులతో పోటీ చేస్తాయా? లేదా ? అన్న వ్యవహారంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

పొత్తులపై రాష్ట్ర నాయకత్వానికి పార్టీ అధిష్టానం క్లారిటీ ఇవ్వనుంది.

కాగా ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలతో హైకమాండ్ చర్చలు జరిపిందని తెలుస్తోంది.

ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) సైతం ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) విశాఖ టూర్ ముగిసిన తరువాత ఢిల్లీకి వెళ్లే యోచనలో ఉన్నారని సమాచారం.అలాగే ఏ క్షణమైనా చంద్రబాబుకు ఢిల్లీ( Delhi ) నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది.

అయితే రానున్న ఎన్నికలకు మూడు పార్టీలు కలిసి వెళ్తాయా? లేదా? అన్న దానిపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement
యూఎస్ లో ప్రీ సేల్స్ విషయంలో దేవర అరాచకం.. ఈ రికార్డ్స్ ఎవరికీ సాధ్యం కాదంటూ?

తాజా వార్తలు