బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచిన సన్నీ లీడ్ రోల్ లో ఓ క్రేజీ వెబ్ సీరీస్ మొదలైంది.హరీష్ శంకర్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ లో సన్నీ, దివి వాద్యా కలిసి నటిస్తున్నారు.
యాంకర్ గా పనిచేసిన సన్నీ ఆ తర్వాత సీరియల్స్ లో నటించాడు.బిగ్ బాస్ సీజన్ 5లో అతని గేమ్ ఆడిన విధానానికి బిగ్ బాస్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
ఈ క్రమంలో టైటిల్ విజేతగా నిలిచిన సన్నీకి ఓ అదిరిపోయే ఛాన్స్ వచ్చింది.ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు చేస్తున్న సన్నీకి బడా బ్యానర్ దిల్ రాజు ప్రొడక్షన్ లో నటించే ఛాన్స్ వచ్చింది.
హరీష్ శంకర్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమవడం లక్కీ అని చెప్పొచ్చు. ఈ వెబ్ సీరీస్ ని చంద్ర మోహన్ డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ వెబ్ సీరీస్ కి ఏ.టి.ఎం అని టైటిల్ ఫిక్స్ చేశారు.ఈమధ్య ఓటీటీల్లో వెబ్ సీరీస్ ల హంగామా ఎక్కువైంది.
సినిమాలతో పాటుగా ఈక్వల్ గా వెబ్ సీరీస్ లను ఆస్వాధిస్తున్నారు ప్రేక్షకులు.బిగ్ బాస్ సన్నీ చేస్తున్న ఈ ఏ.టి.ఎం వెబ్ సీరీస్ ఎలా ఉండబోతుందో చూడాలి.ఈ సీరీస్ లో సన్నీకి ఖచ్చితంగా మరింత బూస్టింగ్ వస్తుందని చెప్పొచ్చు.